Turtle meat | తాబేలు మాంసం తిని 9 మంది మృతి.. 78 మంది ఆస్పత్రిపాలు

Turtle meat: తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషాద ఘటన ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని జాంజిబార్లో ఇటీవల చోటుచేసుకుంది. తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సాధారణంగా సముద్ర తాబేళ్లను తింటుంటారు. ఇక్కడ లభించే సముద్ర తాబేళ్ల మాంసానికి మాంచి డిమాండ్ కూడా ఉంటుంది.
టాంజానియా చుట్టుపక్కల దేశాల వాళ్లు కూడా సముద్ర తాబేలు మాంసం కోసం అక్కడికి వెళ్తుంటారు. పలు రకాల ఫ్లేవర్లలో టేస్టీటేస్టీ తాబేలు మాంసాన్ని అక్కడ అమ్ముతుంటారు. ఈ క్రమంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. దాంతో తూర్పు ఆఫ్రికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ అత్యధికంగా డిమాండ్ ఉండే తాబేలు మాంసం తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.
కాగా, జాంబిబార్లో తాబేలు మాంసం తిని అస్వస్థతకు గురైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జాంజిబార్ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. తాబేలులో కిలోనిటాక్సియం అనే పదార్థం ఉంటుందని, దానివల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఈ విషాదానికి దారితీసి ఉంటుందని అక్కడి వైద్యులు అనుమానిస్తున్నారు.