TUWJ సూర్యాపేట కమిటీ ఏకగ్రీవం
జిల్లా అధ్యక్షుడిగా కోలా నాగేశ్వరరావు.. జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు కృష్ణ విధాత: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కోలా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు కృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా లోని హుజూర్నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్ లో టీయూడబ్ల్యూ యూనియన్ జిల్లా మహాసభ నిర్వహించారు. సభకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యల […]

- జిల్లా అధ్యక్షుడిగా కోలా నాగేశ్వరరావు..
- జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు కృష్ణ
విధాత: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కోలా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు కృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా లోని హుజూర్నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్ లో టీయూడబ్ల్యూ యూనియన్ జిల్లా మహాసభ నిర్వహించారు.
సభకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యల హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి విచ్చేసిన జర్నలిస్టులు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా tuwj కమిటీ అధ్యక్షుడిగా కోల నాగేశ్వరరావు, కార్యదర్శిగా బంటు కృష్ణ, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడిగా గింజల అప్పిరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కోల నాగేశ్వరరావు, బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, అర్హులైన వారికి అక్రిడేషన్ అదించాలని కోరారు.
కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ కమిటీ సభ్యులు కల్లూరు సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు చలసాని శ్రీనివాస్ చౌదరి అక్రిడేషన్ కమిటీ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు. మా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడికి, యూనియన్ సభ్యులకి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు.. అభినందనలు తెలిపారు.