వెంకటేష్, మలినేని కాంబినేషన్? ఈ సారైనా హిట్ పడేనా!
విధాత: టాలీవుడ్లోని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లో గోపీచంద్ మలినేని ఒకరు. రవితేజ హీరోగా రూపొందిన డాన్ శ్రీనుతో కెరీర్ మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ తో బాడీగార్డ్ , రవితేజతో బలుపు చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన రామ్ పండగ చేస్కో, సాయి ధరమ్ తేజ్ విన్నర్ లాంటి సినిమాలు సరిగ్గా ఆడలేదు. కరోనా సమయంలో మరోసారి క్రాక్ సినిమాతో రవితేజను డిఫరెంట్గా చూపిస్తూ […]

విధాత: టాలీవుడ్లోని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లో గోపీచంద్ మలినేని ఒకరు. రవితేజ హీరోగా రూపొందిన డాన్ శ్రీనుతో కెరీర్ మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ తో బాడీగార్డ్ , రవితేజతో బలుపు చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన రామ్ పండగ చేస్కో, సాయి ధరమ్ తేజ్ విన్నర్ లాంటి సినిమాలు సరిగ్గా ఆడలేదు.
కరోనా సమయంలో మరోసారి క్రాక్ సినిమాతో రవితేజను డిఫరెంట్గా చూపిస్తూ హ్యాట్రిక్ హిట్స్ కొట్టగా, తాజాగా ఆయన బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రం చేసి నందమూరి అభిమానుల చేత జేజేలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే ఆయన ప్రభాస్ సహా మరి కొందరు హీరోలకు కథలు చెప్పారని అవి చర్చల స్టేజీలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా వెంకటేశ్తో ఆయన బాడీగార్డ్ అనే సాధారణ చిత్రాన్ని అందించినప్పటికీ వెంకటేష్ మరోసారి గోపీచంద్ మలినేనితో జోడి కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ మలినేనితో కలిసి వెంకీ ప్రాజెక్టును సెట్ చేయాలని సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చివరిగా ఎఫ్ 3 చిత్రంతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఎఫ్2తో పోల్చుకుంటే ఎఫ్3 కేవలం యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది.
ఇక తాజాగా తన 75వ చిత్రాన్ని వెంకటేష్ హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో ఊపు మీద ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలనుతో సైంధవ్ చిత్రం ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిందో లేదో వెంకటేశ్తో గోపీచంద్ సినిమా చేసేందుకు రంగం సిద్ధమైందని వార్త తెర పైకి వచ్చింది.
ప్రస్తుతం గోపీచంద్ వీరసింహారెడ్డి సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం నందమూరి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. వాల్తేరు వీరయ్య సినిమాతో పోటీ పడి కాస్త వెనుక బడినా సరే బాలయ్య కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా వీరసింహారెడ్డి నిలవడంలో గోపీచంద్ మలినేని పాత్ర ఎంతో ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
ఇక గతంలో గోపీచంద్ మలినేనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో రెండు చిత్రాలు ఓకే అయ్యి ఆగిపోవడంతో మరోసారి యంగ్ టైగర్ను లైన్లో పెట్టే అవకాశం కూడా ఉందని అంటున్నారు.