మందుబాబులకు రంగు పడింది.. సోమవారం వైన్స్ల బంద్
హోలీ పండుగ వేళ మందుబాబులకు రంగు పడింది. రేపు (సోమవారం) హోలీ పండుగ సందర్భంగా వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసుల ఆదేశాలు

విధాత, హైదరాబాద్: హోలీ పండుగ వేళ మందుబాబులకు రంగు పడింది. రేపు (సోమవారం) హోలీ పండుగ సందర్భంగా వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసి ఉంచాలని పోలీసులు సూచించారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులను మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయించారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి.
ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే హోలీ వేడుకలను ఇతరులకు ఇబ్బంది కలుగకుండా జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్లపైకి గుంపులుగా రావద్దని సూచించారు. రోడ్లపై వచ్చిపోయే వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.