పెండ్లికి వెళ్లి వ‌స్తూ మృత్యు ఒడికి.. చెట్టును ఢీకొట్టిన ఎస్‌యూవీ వాహ‌నం

వివాహ వేడుక‌కు వెళ్లి వ‌స్తూ ఐదుగురు మృత్యు ఒడికి చేరారు. ఇద్దరు పిల్లలుసహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఎస్‌యూవీ వాహ‌నం చెట్టును ఢీకొట్ట‌డంతో శనివారం తెల్ల‌వారుజామున ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

  • Publish Date - November 18, 2023 / 06:20 AM IST

  • ఐదుగురు దుర్మ‌ర‌ణం.. మ‌రో ఐదుగురికి గాయాలు
  • జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఘ‌ట‌న



విధాత‌: వివాహ వేడుక‌కు వెళ్లి వ‌స్తూ ఐదుగురు మృత్యు ఒడికి చేరారు. ఇద్దరు పిల్లలుసహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఎస్‌యూవీ వాహ‌నం చెట్టును ఢీకొట్ట‌డంతో శనివారం తెల్ల‌వారుజామున ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.


గిరిదిహ్ సదర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అనిల్ సింగ్ వివ‌రాల ప్ర‌కారం.. బిర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని థోరియా గ్రామానికి చెందిన ప‌ది మంది టికోడిహ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన వివాహ వేడుక‌కు ఎస్‌యూవీలో వెళ్లారు. తిరిగి స్వ‌గ్రామానికి వాహ‌నంలో బ‌య‌లుదేరారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్మారా ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న చెట్టును వీరి వాహ‌నం ఢీకొట్టింది.


ఘ‌ట‌నాస్థ‌లిలోనే అక్క‌డిక‌క్క‌డే ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. ఇద్దరు పిల్లలుసహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డిన‌ ఐదుగురిని ద‌వాఖాన‌లో చేర్పించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండ‌టం వ‌ల్ల వాహ‌నం అదుపు త‌ప్పి ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Latest News