ఛత్తీస్గఢ్లో విషాదం నెలకొంది. విష వాయువులు పీల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు మృతి చెందారు.
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో విషాదం నెలకొంది. విష వాయువులు పీల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. చంపా జిల్లా కికిర్దా గ్రామంలో ఉన్న ఓ బావిలో ఒక చెక్క పడింది. దాన్ని బావిలో నుంచి తీసేందుకు రామచంద్ర జైశ్వాల్ అనే వ్యక్తి లోపలికి దిగాడు. బావిలోనే అతను స్పృహ కోల్పోవడంతో బయటకు రాలేకపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సహాయం చేయాలని గ్రామస్తులను కోరారు.
VIDEO | Five people lost their lives as they drowned after inhaling gas leaked inside a well in Chhattisgarh’s Champa. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/oznnI6BsPb
— Press Trust of India (@PTI_News) July 5, 2024
దీంతో మరో ముగ్గురు వ్యక్తులు కలిసి రామచంద్ర జైశ్వాల్ను బావిలో నుంచి బయటకు తీసేందుకు లోపలికి దిగారు. ఆ ముగ్గురు కూడా బావిలోనే స్పృహ కోల్పోయారు. వీరిని రక్షించేందుకు మరో వ్యక్తి కూడా బావిలోకి దిగగా అతను కూడా ప్రాణాలొదిలాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కికిర్దా గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బావిలో ఉన్న విష వాయువులను పీల్చడం వల్లే ఆ ఐదుగురు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. ఐదుగురి మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను రామచంద్ర జైశ్వాల్, రమేశ్ పటేల్, రాజేంద్ర పటేల్, జితేంద్ర పటేల్, తికేశ్వర్ చంద్రగా పోలీసులు గుర్తించారు.