కేంద్ర భూగర్భ, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు నెమలికొండ వేణుమాధవ్ పుష్పగుచ్చం, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన సన్మానం
ఢిల్లీలోని మంత్రి నివాసంలో కిషన్ రెడ్డిని సన్మానించిన నెమలికొండ వేణుమాధవ్
విధాత : కేంద్ర భూగర్భ, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు నెమలికొండ వేణుమాధవ్ పుష్పగుచ్చం, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నెమలికొండ వేణుమాధవ్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుంచి రెండోసారి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించడం గొప్ప విషయం అన్నారు. బిజెపి అధిష్టానం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించడం సామాన్య కార్యకర్తకు ఇచ్చిన గౌరవం అన్నారు. సామాన్య కార్యకర్తకు సైతం ఉన్నత పదవులు కట్టబెట్టడం బిజెపిలోనే సాధ్యపడుతుందన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన కిషన్ రెడ్డిది మచ్చలేని నాయకత్వమని వేణుమాధవ్ కొనియాడారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం తధ్యమని వేణుమాధవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో బలమైన శక్తిగా బిజెపి ఆవిర్భవిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.