బాధ్యతారాహిత్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు
విధాత: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కరోనా బారిన పడి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారులు స్పందిచడం లేదని తెలిపారు. నేడు కరోనా కంటే ముఖ్యమైన సమస్య ఉందా? అని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన ప్రశ్నించారు. వెంటనే సమస్యను పరిష్కరించి కోవిడ్ బాధితులకు మెరుగైన […]

విధాత: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కరోనా బారిన పడి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు.
హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారులు స్పందిచడం లేదని తెలిపారు. నేడు కరోనా కంటే ముఖ్యమైన సమస్య ఉందా? అని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన ప్రశ్నించారు. వెంటనే సమస్యను పరిష్కరించి కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన కోరారు. లేకుంటే రెండు రాష్ట్రాల సీఎంకు ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.