ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివో తన కొత్త వై సిరీస్ ఫోన్ను చైనాలో విడుదల చేసింది. వివో వై200ఐ గా పిలువబడే ఈ ఫోన్ వివో గత ఫోన్ వై100ఐ తర్వాత తరానిది. వివో ఫోన్లకు భారత్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో భారత్లో విడుదల కూడా త్వరలోనే ఉండనుంది.
పాపులర్ మైబైల్ బ్రాండ్ వివో తన సరికొత్త వై సిరీస్ మాడల్ వై200ఐ ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్4 పై నడుస్తుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 44వాట్ ఫాస్ట్ చార్జింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్4 జెన్2 ప్రాసెసర్తో రానున్న ఈ ఫోన్ 12జిబి వరకు మెమొరీని కలిగిఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.72 అంగుళాల తెర దీని ప్రత్యేకం. ఒక పక్కనున్న ఫింగర్ప్రింట్ స్కానర్, ఐపి64 రేటింగ్, 3.5 ఆడియో జాక్ కూడా దీన్లో పొందుపరిచారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్లో అమర్చారు. ఇవేకాకుండా, స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ సిమ్, 5జి, 4జి ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, యూఎస్బీ పోర్ట్ కూడా అమరిఉన్నాయి. 165.7ఎంఎం పొడవు, 76ఎంఎం వెడల్పు, 8.09 మందం కలిగిన ఈ ఫోన్ 199 గ్రాముల బరువు కలిగిఉన్నాయి. చూడ్డానికి సన్నగా, అందంగా ఉన్న వై200ఐ, మంచి బ్యాటరీ లైఫ్తో, కళ్లకు రక్షణ కల్పించే తెరతో, 3డి సౌండ్తో, ఏఐ ఆధారిత అసిస్టెంట్తో చాలా బాగుంది. ఇంకా దీనికి దుమ్ము, నీటి నుండి రక్షణ కల్పించే ఐపి64 రేటింగ్ కూడా ఉంది.
బ్లూ, గ్లేసియర్ వైట్, మిడ్నైట్ బ్లాక్ రంగులలో లభించే ఈ ఫోన్ ధరలను 8జిబి+256జిబి వర్షన్కు 1599 యువాన్లు( దాదాపు 18,800 రూ.), 12జిబి+256జిబి వర్షన్కు 1799 యువాన్లు( దాదాపు 21,155 రూ.), 12జిబి+512జిబి వర్షన్కు 1999 యువాన్లు( దాదాపు 23,505 రూ.)గా నిర్ణయించారు. చైనాలో ఈరోజు నుండి ఆర్డర్లు తీసుకుంటుండగా, 27 ఏప్రిల్ నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కాగా, భారత్లో ఇది ఎప్పడు లాంచ్ చేస్తారన్నది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.