హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం ఆసక్తి రేపింది. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది
విధాత: హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం ఆసక్తి రేపింది. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ బాబా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా సికింద్రాబాద్, మల్కాజిగిరి టికెట్లను ఆశిస్తూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీలత శోభన్ రెడ్డి సైతం సికింద్రాబాద్ టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది