KCR | విద్యుత్తు కమిషన్పై సుప్రీంకోర్టుకు మాజీ సీఎం కేసీఆర్
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్తు కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు

విధాత: ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్తు కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
విద్యుత్తు కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ను జూన్ 24న తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్.. నేడు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952, విద్యుత్తు చట్టం-2003కి అది విరుద్ధమని.. దాన్ని రద్దుచేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే.. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప.. దానిపై విచారించే అధికారం కమిషన్కు లేదని తన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు