ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు.
విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తానని గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా గవర్నర్ తమిళి సై పలు సందర్భాల్లో ప్రత్యక్ష రాజకీయాల పట్ల తన ఆసక్తిని చాటుతూ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.
2019లో కేంద్రం ఆమెను తెలంగాణ గవర్నర్గా నియమించింది. ప్రస్తుతం ఆమె అదనంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అయితే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆమె సొంత రాష్ట్రం తమిళనాడులో ఎంపీగా పోటీ చేయాలని భావిసున్నారు. బీజేపీ అధిష్టానం తమిళిసైని కన్యాకుమారి నియోజకవర్గంలో నాడర్ సామాజిక వర్గానికి చెందిన నటుడు విజయ్ సంపత్పై పోటీ దించాలని ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఎంపీ ఎన్నికల్లో పోటీకి సిద్దమన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.