నిబంధనలకు విరుద్ధంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో 18సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్తు శాఖ ఉద్యోగి, మైనార్టీ శాఖ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్
విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో 18సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్తు శాఖ ఉద్యోగి, మైనార్టీ శాఖ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 7 సార్లు ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఏ హోదాలో ప్రభుత్వ ఉద్యోగులతో తన ఇంట్లో పనులు చేయించుకుంటున్నారో చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు శాఖలో 80వేల కోట్ల అవినీతిపై చర్చ జరుగుతున్న నేపధ్యంలో షబ్బీర్ అలీ ఇంట్లో ఉద్యోగుల పేరుతో 2కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి, మాణిక్ రావు థాక్రేలు షబ్బీర్ అలీ ఇంటికి పోయినప్పుడు ఆ ఉద్యోగస్తులు టీ ఇచ్చి ఉంటారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.