కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ నిర్మాణానికి 72ఏళ్లు పడ్టింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
విధాత : కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ నిర్మాణానికి 72ఏళ్లు పడ్టింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని పునఃనిర్మించిన వేయిస్తుంభాల దేవాలయం కల్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో ప్రారంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు.
తాజాగా పునర్నిర్మాణం చేసిన వేయి స్తంబాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వివరించారు. దీనివల్లే సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 2005లో కేంద్ర పురావస్తుశాఖ కల్యాణ మండప పునర్నిర్మాణ మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 19 ఏండ్ల తర్వాతా తిరిగి భక్తులకు వేయి స్తంభాల కల్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. 2022ఏప్రిల్ 26న రామప్ప టెంపుల్కు యూనెస్కో గుర్తింపు పొందిన సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన కిషన్రెడ్డి వేయి స్తంభాల ఆలయాన్ని పునరుద్దరణపై హామీ ఇచ్చి మొత్తం రూ.15 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేశారు.
132స్తంభాలు, 100దిమ్మెలు, ఏడు అంచలుగా ఉన్న ఆధార పీఠం, ఐదుల అంచల ఉభయం పీటం, ప్రదక్షిణ పీఠం మొత్తం 3,200శిలు, శిల్పాలకు నెంబర్లు వేసి వీడదీసి, తిరిగి సాండ్ బాక్స్టెక్నాలాజీతో పునర్ నిర్మించారు. 2,540శిల్పాలు తిరిగి వినియోగించగా, దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్త శిల్పాలను వాడారు. దండయాత్రల్లో ధ్వంసమైన భారీ నంది విగ్రహాన్ని కృష్ణ శిలల చూర్ణంతో రసాయన మిశ్రమంతో తోక, చెవులు, కాళ్లను యధావిధిగా అమర్చి సుందరంగా పునర్నిర్మించారు.
ఓరుగల్లు నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో ఒకటో రుద్రుడు కీ.శ.1163లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1,400 మీటర్ల వైశాల్యంలో, శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ త్రికూటాలయాన్ని రూపొందించారు. శిలలపై సప్తస్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయపాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వెయ్యి స్తంభాలతో వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా కాకతీయుల నిర్మాణ శైలీ సాండ్ బాక్స్టెక్నాలాజీతో ఆలయాన్ని నిర్మించారు. పునర్నిర్మాణాన్ని సైతం అదే పద్ధతిలో పూర్తి చేయడం విశేషం.