సంవత్సరంలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే..అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, తోకాడిస్తున్న పోలీసులు మళ్లీ మన మాట వినాలంటే మనకు 10నుంచి 12ఎంపీ సీట్లు రావాలని, అందుకు బీఆరెస్ శ్రేణులు
విధాత, హైదరాబాద్ : సంవత్సరంలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే..అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, తోకాడిస్తున్న పోలీసులు మళ్లీ మన మాట వినాలంటే మనకు 10నుంచి 12ఎంపీ సీట్లు రావాలని, అందుకు బీఆరెస్ శ్రేణులు కష్టపడాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కోన్నారు. కరీంనగర్ బీఆరెస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపు కోరుతూ రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, డీలిమిటేషన్ వంటి వాటితో తెలంగాణకు అన్యాయం చేస్తే అడ్డుకునే శక్తి కేవలం గులాబీ కండువాకే ఉందన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు బీఆరెస్ మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలన్నారు. తెలంగాణను 2014లో బడే భాయ్ ప్రధాని మోదీ.. 2024లో చోటా భాయ్ సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారన్నారు. రూ.30లక్షల కోట్లు రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. పదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాముడి జపం చేస్తూ మళ్లా ఎన్నికల్లో ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శ్రీరామచంద్రుడు అందరివాడని.. బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదని..మనం సైతం జై శ్రీరామ్ అందామని తెలిపారు. .
ప్రజలు మనల్ని ఓడించలేదు
మనల్ని ప్రజలు ఓడించలేదని.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ అన్నారు. తల్లిలాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన బెట్టి కలిసికట్టుగా పోరాడాలని, అందూ కేసీఆర్ మనుషులేనన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని కేటీఆర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్కి సవాల్ విసిరారు. కరీంనగర్లో బీజేపీ-బీఆరెస్ మధ్యనే పోటీ అన్నారు. ఇక్కడ పోటీలో కాంగ్రెస్ లేదన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ముక్కు మొహం తెలియని వారిని తీసుకువచ్చి నిలబెట్టారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్కు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండాల్సివుందని, సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్లో కరీంనగర్కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు.కాంగ్రెస్ అభ్యర్థికి కండువా లేకుండా తిప్పాపూర్ బస్టాండ్లో నిలబెడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తించరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సఈఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. వరి పంటకు ఇస్తానన్న రూ.500 రూపాయల బోనస్ బోగస్ అయ్యిందని.. ఆరు హామీలు అమలుకావడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉచిత బస్సు ఉచిత విద్యుత్ పథకాలు కూడా మాయం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు..పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ అవసరమని గ్రహించి 70ఏళ్ల వయసులో తుంటి విరిగినా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారన్నారు.