గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే: కేటీఆర్
ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం దీక్షా దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు

- బేవకూఫ్ గళ్లు ముఖ్యమంత్రులవుతారట..
- గులుగుడు గులుగుడే ..గుద్దుడు గుద్దుడే
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్
- హైదరాబాద్లో బీఆరెస్ వేవ్
- మేమే గెలుస్తున్నాం
- కాంగ్రెస్ ఆఫీస్లో తయారైన సర్వేలు అలాగే ఉంటాయి
- రేవంత్ రెండు చోట్ల ఓడిపోతున్నాడు
- కాంగ్రెస్కు పవర్ ఇస్తే… జనాలకు పవర్ కట్ చేస్తారు
- అశోక్ నగర్ వెళ్లి.. బావార్చిలో బిర్యాని తిని టైంపాస్ చేసిన రాహుల్
- మీడియాతో బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్
విధాత, హైదరాబాద్: ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం దీక్షా దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రాష్ట్రంలో మేమే గెలుస్తున్నామన్నారు. సైలెంట్ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉందని తెలిపారు. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లవుతావు అంటే గుంపు మేస్ట్రీ అంటుండని, ఇట్లాంటి బేవకూఫ్ గాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరోనా అనేది తెలవకుండా వస్తుందని, తెలిసి తెచ్చుకుందామనుకుంటే అది కాంగ్రెస్ వైరస్ అవుతుందని కేటీఆర్ అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంది,కాంగ్రెస్ కు వ్యాక్సిన్ లేదన్నారు. అశోక నగర్ వెళ్లి, బావార్చిలో బిర్యానీ తిని టైం పాస్ చేసిన రాహుల్ ..మేమిచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రం లో ఇచ్చిందో చెప్పలేదని,చర్చకు రాలేదన్నారు. పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు…చివరి వరకు ఉండేది కేసీఆర్ మాత్రమేనన్నారు. గులుగుడు గులుగుడే ..గుద్దుడు గుద్దుడే నన్నారు.

రైతు బంధు పై కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారన్నారు. దాంతో కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కాంగ్రెస్ కు పవరిస్తే ,జనాలకు కరెంట్ కట్ చేస్తారని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు విషయంలో హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముందని కేటీ ఆర్ అన్నారు. టీ హబ్ విషయంలో నాకు వ్యక్తిగతంగా నోటీసు ఇచ్చారని తెలిపారు .అలాగే రైతు బంధు విషయంలో హరీష్ రావు తప్పు చేస్తే హరీష్ కి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి కానీ రైతు బంధు ఆపడం ఏంటని ప్రశ్నించారు. పీఎం కిసాన్ కు లేని ఆంక్షలు రైతు బందుపై ఎందుకు ? అని అడిగారు.
హైదరాబాద్లో బీఆరెస్ వేవ్ ఉందని తెలిపారు. ములుగు, గోషామహల్,హుజురాబాద్,ఖమ్మంలో కూడా కొన్ని సీట్లు గెలుస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. రాజసింగ్ ది లోద్ కమ్యూనిటీ అని, ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు వారంతా మాతోనే ఉంటామని చెప్పారన్నారు. మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మాట్లాడి, మాకు మద్దతు తెలిపారని చెప్పారు.
కాంగ్రెస్ ఆఫీస్ లో తయారైన సర్వేలు చూస్తే అలాగే ఉంటాయన్నారు. సీ ఓటర్ సర్వే 2018 లో చెప్పింది, ఇప్పుడు చెబుతుంది, పప్పులో కాలేసింది.. ఇది మాకు శుభసూచకమన్నారు. కొడంగల్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని, కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తున్నారన్నారు. రేవంత్ రెండు చోట్లా ఓ డిపోతున్నాడని కేటీఆర్ జోష్యం చెప్పారు. సిరిసిల్లలో చాలా టఫ్ గా ఉందని కాంగ్రెస్ సర్వే లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
తాము అధికారంలోకి రావడానికి 51 శాతం ఓట్లు చాలన్నారు. చాలా ప్రాంతాల్లో బీజేపీ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నా రు. రాహుల్ గాంధీ ఎందుకు గోషా మహల్ ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. అలాగే కరీంనగర్,కోరుట్ల లో రాహుల్,రేవంత్ ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. ప్రధాని మోదీ చేసిన ప్రచారం అంతా పార్లమెంటు ఎన్నికల కోసమేనన్నారు. బీజేపీ కి లాస్ట్ టైం 108 సీట్లలో డిపాజిట్ రాలేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డిలో రెండు మూడు చోట్ల తమకు గట్టిపోటీ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. మెదక్ లో 10 లో 9 సీట్లు గెలుస్తున్నామన్నారు.
కేసీఆర్ పై ప్రజలకు క్రెడిబిలిటీ ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ చెప్పినవి 90 శాతం చేశా రని,చెప్పనివి కూడా చేశారన్నారు. దీక్ష దివస్ రోజు నేను ఒక రోజు జైల్లో ఉన్నానన్నారు.