సమైఖ్యపాలనలో లగడపాటి రాజగోపాల్ నాఫోన్ ట్యాప్ చేశారు, తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి
తన తమ్ముడికి పదవి వస్తుందని కోమటిరెడ్డి బెంగ
గ్రామాల్లో చైతన్యం రావాలి
విధాత: సమైఖ్యపాలనలో లగడపాటి రాజగోపాల్ నాఫోన్ ట్యాప్ చేశారు, తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి. ఆదివారం నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో జరిగిన కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది, ఫేక్ కేసులు, లీకులు తప్ప పాలించడం కాంగ్రెస్కు చేతకాదన్నారు. పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ నాయకులెవ్వరూ పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా ఏనాడు పోలీసులను వాడుకోలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల జాబితా ఇస్తే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ లాగు ఊడబీకుతానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, లాగు విప్పి ఏం చూస్తాడని ప్రశ్నించారు. నల్లగొండ పిచ్చి మంత్రి ఎగిరెగిరి పడుతున్నాడన్నారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు కూడా తాము నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు సాగర్లో నీళ్లు ఉన్నకూడా ఇవ్వలేని రండలు, చేతకాని వెదవలని కాంగ్రెస్ నాయకులను దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన తమ్ముడికి మంత్రి పదవి వస్తే తన పదవి ఊడిపోతుందని బెంగ పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాయ హామీలపై ఎక్కడికక్కడ నిలదియాలి, గ్రామాల్లో చైతన్యం రావాలి, ప్రజలు మోసపోవద్దన్నారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ కు శ్రీరామరక్ష అని, గులాబి జెండా వేసుకున్న యోధులు మన కార్యకర్తలు, ఏ మాత్రం పొరపాటు చేసినా ఆగం అయితామని ఎమ్మెల్యే జగదీష్రెడ్డి వెల్లడించారు.