డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్
తెలంగాణ 2024 డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. 2024 అక్టోబర్ 10 నుంచి సర్వీస్ లెక్కించి, వేతనం చెల్లించాలన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్ 10 నుంచి వేతన బిల్లులను అనుమతించాలని ట్రెజరీ అధికారులకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది

విధాత, హైదరాబాద్ : తెలంగాణ 2024 డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. 2024 అక్టోబర్ 10 నుంచి సర్వీస్ లెక్కించి, వేతనం చెల్లించాలన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్ 10 నుంచి వేతన బిల్లులను అనుమతించాలని ట్రెజరీ అధికారులకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 11,062 మంది ఉపాధ్యాయులకు (సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్) కు ప్రయోజనం చేకూరనుంది. వారి సర్వీసు రికార్డుకు కూడా ఉపయోగకరం కానుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.