విధాత : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజున శుక్రవారం ఉదయం మలయప్ప స్వామి రామావతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
హనుమంత వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహారించిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం పుష్పక విమాన సేవ అనంతరం, గజవాహన సేవ నిర్వహించారు.