బార్డర్ లోభారిగా హెరాయిన్
విధాత,శ్రీనగర్: భారత్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళం కాల్చివేసింది. అతడి నుంచి 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక్టార్లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్న వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. అతడిని లొంగిపోవాలని కోరినప్పట్టికీ ససేమిరా ఒప్పుకోకపోవడంతో కాల్చివేశారు. తదనంతరం అతని వద్ద 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ సుమారు రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం […]

విధాత,శ్రీనగర్: భారత్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళం కాల్చివేసింది. అతడి నుంచి 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక్టార్లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్న వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. అతడిని లొంగిపోవాలని కోరినప్పట్టికీ ససేమిరా ఒప్పుకోకపోవడంతో కాల్చివేశారు. తదనంతరం అతని వద్ద 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ సుమారు రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
Readmore:నవనీత్ కౌర్కు సుప్రీం కోర్టులో ఊరట