దేశంలో మరో 3.79 లక్షల మందికి కరోనా నిర్ధారణ
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524నిన్న 3,645 మంది మృతిమృతుల సంఖ్య మొత్తం 2,04,83215,00,20,648 మందికి వ్యాక్సిన్లుభారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొత్తగా 3,79,257 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 2,69,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో […]

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524
నిన్న 3,645 మంది మృతి
మృతుల సంఖ్య మొత్తం 2,04,832
15,00,20,648 మందికి వ్యాక్సిన్లు
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొత్తగా 3,79,257 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 2,69,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 3,645 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,04,832 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,50,86,878 మంది కోలుకున్నారు. 30,84,814 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,00,20,648 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,44,71,979 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,68,190 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.