" /> " /> " />
"మోడీ ఎగ్జామ్స్ వారియర్" పుస్తకాన్ని ప్రచురించడం పెంగ్విన్ తనను తాను అవమాన పరుచుకోవడమే.*అరుంధతీరాయ్ ఇది అంతు చిక్కని అసంబద్దమైన మోడీ డిగ్రీ లాంటిదే. మోడీ తన 28 వ ఏట కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా బీ.ఏ., డిగ్రీ సంపాదించడం, యూనివర్సిటీ ఎప్పుడూ ఇవ్వనటువంటి 'ఎంటైర్ పొలిటికల్ సైన్స్' ఎంఏ డిగ్రీ పొందడం లాంటిదే ఇది.మోడీ తీసుకున్న డిగ్రీల ప్రామాణికతను పరిశీలించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మోడీ 2014 ఎన్నికలలో నిలబడినప్పడు చేసిన ప్రమాణాలను గుజరాత్ విశ్వవిద్యాలయంతోపాటు ఎన్నికల […]
“మోడీ ఎగ్జామ్స్ వారియర్” పుస్తకాన్ని ప్రచురించడం పెంగ్విన్ తనను తాను అవమాన పరుచుకోవడమే.
*అరుంధతీరాయ్
ఇది అంతు చిక్కని అసంబద్దమైన మోడీ డిగ్రీ లాంటిదే.
మోడీ తన 28 వ ఏట కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా బీ.ఏ., డిగ్రీ సంపాదించడం, యూనివర్సిటీ ఎప్పుడూ ఇవ్వనటువంటి ‘ఎంటైర్ పొలిటికల్ సైన్స్’ ఎంఏ డిగ్రీ పొందడం లాంటిదే ఇది.మోడీ తీసుకున్న డిగ్రీల ప్రామాణికతను పరిశీలించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.
మోడీ 2014 ఎన్నికలలో నిలబడినప్పడు చేసిన ప్రమాణాలను గుజరాత్ విశ్వవిద్యాలయంతోపాటు ఎన్నికల కమిషన్, చివరికి న్యాయస్థానాలు కూడా బైటికి రాకుండా చేశాయి.
ఈ పరీక్షల వీరుడు రాసిన పరీక్షలు ఏమిటో మనకు తెలియదు.
గత కొన్ని సంవత్సరాలుగా మోడీ పాలనాకాలంలో హిందూజాతీయ వాద మద్దతు దారులు ప్రచురణ కర్తలపైన, సాహిత్య రంగంపైన తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.వీరికి అనుకూలంగా దాదాపు ప్రతి సంస్థ వీరి బెదిరింపులకు తలవంచకతప్పడం లేదు.
వీరంతా ఇప్పడు రచయితలను ప్రధాన స్రవంతిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు.
చాలా మంది ప్రచురణ కర్తలు, సాహిత్య సంస్థలు లొంగిపోతున్నాయి.పెంగ్విన్ ఇండియాలోని నా సొంత సంపాదకులు నా సృజనాత్మక రచనలను, ఇతర రచనలను ప్రచురించడమే కాకుండా నా కోసం నిలబడ్డారు.
మోడీ, అతని నేరపూరిత పాలనాకాలంపై ఇదొక దాడి ” అని అరుంధతీరాయ్ వ్యాఖ్యానించారు.