మాపై కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు

విధాత‌: డిజిపి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు.ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు,ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశారు.పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదు.తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారన్నారు. డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఆ కారణం గా ఇంట్లో భోజనం చేయలేక పోతున్నాము,అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని […]

మాపై కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు

విధాత‌: డిజిపి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు.ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు,ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశారు.పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదు.తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారన్నారు.

డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఆ కారణం గా ఇంట్లో భోజనం చేయలేక పోతున్నాము,అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీనీ కోరారు.

దీనిపై డిజిపి సానుకూలంగా స్పందిస్తూ రమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేసు దర్యాప్తును పోలీసులు వేగంగా పూర్తి చేశారని తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు..వారితో ఏకీభవిస్తూ కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించిన డిజిపి.

రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి వారికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని బరోసా కల్పించారు,రమ్య కుటుంబన్ని మానసికంగా వేదిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం.రమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసాము,కోర్టులో ట్రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరుతామన్నారు.

మహిళ భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.మహిళ కోసం అనే సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తుంది,ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్నివిధాలుగా రమ్య కుటుంబానికి సహాయసహకారాలు అందిస్తుందని వెల్ల‌డించారు.