బోగస్ చలానాలపై తనిఖీలు
విధాత:సీఎ్ఫఎం విధానంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.కడప, కర్నూలు,నంద్యాల, పులివెందుల, తిరుపతి అర్బన్ తదితర చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలియడంతో..‘బోగస్ చలానాలతో ఖజానాకు గండి’ శీర్షికన ‘పత్రికలలో’ కథనం ప్రచురించింది.దీనిపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ గత మూడు నెలలుగా డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్కు వచ్చిన చలానాలను పరిశీలించాలని, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము మొత్తం వచ్చిందో లేదో చూడాలని స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ శాఖ […]

విధాత:సీఎ్ఫఎం విధానంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.కడప, కర్నూలు,నంద్యాల, పులివెందుల, తిరుపతి అర్బన్ తదితర చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలియడంతో..‘బోగస్ చలానాలతో ఖజానాకు గండి’ శీర్షికన ‘పత్రికలలో’ కథనం ప్రచురించింది.దీనిపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ గత మూడు నెలలుగా డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్కు వచ్చిన చలానాలను పరిశీలించాలని, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము మొత్తం వచ్చిందో లేదో చూడాలని స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ శాఖ ఐజీ శేషగిరిబాబు ఆదేశించారు.
ఈ మేరకు కడప సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో 10 బోగస్ చలానాలను గుర్తించారు.
కడప కడప అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో స్టాంపుడ్యూటీ రుసుమును డాక్యుమెంట్ రైటర్ జయరామకృష్ణ బోగస్ చలానాలతో స్వాహా చేసినట్లు తేలడంతో ఆయనపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు.మిగతా కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.మరోవైపు రిజిస్ర్టేషన్ చేయించుకునేవారు ఎంత మొత్తం చలానాగా కట్టారన్నది సబ్ రిజిస్ర్టార్ కంప్యూటర్లోనూ కనిపించేలా సీఎ్ఫఎంఎస్లో సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు.సోమవారం నుంచి ఈ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేయనున్నారు.