రైతు సంక్షేమమే వైఎస్ జగన్ ప్రధాన లక్ష్యం
వ్యవసాయాభివృద్దితో మరో హరిత విప్లవం ఇప్పటివరకు సుమారు రూ 83 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం విధాత:సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ, అనుబంధ రంగాల సంక్షేమ పధకాలతోమరో హరిత విప్లవం మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.ఇఫ్కో ఆవిష్కరించిన నానో యూరియాను బుధవారం అమరావతి నుంచి వర్చువల్ మోడ్లో లాంఛనంగా ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం […]

- వ్యవసాయాభివృద్దితో మరో హరిత విప్లవం
- ఇప్పటివరకు సుమారు రూ 83 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం
విధాత:సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ, అనుబంధ రంగాల సంక్షేమ పధకాలతో
మరో హరిత విప్లవం మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.ఇఫ్కో ఆవిష్కరించిన నానో యూరియాను బుధవారం అమరావతి నుంచి వర్చువల్ మోడ్లో లాంఛనంగా ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రెట్టింపు ఆదాయం కలిగేలా మరో వైపు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత రెండు సంవత్సరాలలో రైతుల కోసం సుమారు 83వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ఆయన తెలిపారు .
రైతుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో సుమారు 10800 RBKలు పనిచేస్తున్నాయని , వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు .ఈ నూతన ఉత్పాదన నానో యూరియాను కూడా RBKల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు .నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివెళ్లి తగు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు .డాక్టర్ పూనమ్ మాలకొండయ్య మాట్లాడుతూ ఇఫ్కో ఇటువంటి ఉత్పాదనలు తేవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . దీనికి కావాల్సిన ప్రచారం కోసం వ్యవసాయ శాఖ నుంచి అన్ని విధాలా సహకరిస్తామని తెలియచేసారు.
సహకార , మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఒక 500ml బాటిల్ నానో యూరియా 45 కేజీల సంప్రదాయ యూరియా కు సమానమని ఈ నానో యూరియా వాడకం వలన మన కోస్తా జిల్లాలోని కలిగే గుర్రపు డెక్క , డ్రైనేజీ సమస్యలను అరికట్టవచ్చునని అన్నారు .మంత్రి కన్నబాబు పచ్చ జెండాతో ఇఫ్కో కలోల్, గుజరాత్ నుంచి ఇఫ్కో నానో యూరియా బాటిల్స్ ఉన్న లారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరింది. ఈ కార్యక్రమములో H. అరుణ్ కుమార్ వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు S.H. మాంజి ఆంద్రప్రదేశ్ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ గారు పాల్గొన్నారు.