Duvvada Srinivas | దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపులు.. వాణికి నోటీసులు.. ముందుగా దువ్వాడకే ఇవ్వాలని పట్టు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం మరిన్ని కీలక మలుపులు తీసుకుంది. న్యాయం కోరుతూ 11రోజులుగా భర్త దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కారు షెడ్డులో కూతుళ్లతో కలిసి ధర్నా చేస్తున్న దువ్వాడ వాణికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇచ్చిన ఆస్తులు.. ఇళ్లు తీసుకుని లీగల్గా పోరాడాలని భార్యకు హితవు
అనారోగ్యంతో ఉన్న పదిరోజుల తర్వాత కలుస్తానన్న దివ్వెల
Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం మరిన్ని కీలక మలుపులు తీసుకుంది. న్యాయం కోరుతూ 11రోజులుగా భర్త దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కారు షెడ్డులో కూతుళ్లతో కలిసి ధర్నా చేస్తున్న దువ్వాడ వాణి (Duvvada Vani) కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ముందుగా తన భర్త శ్రీనివాస్కు నోటీసులివ్వాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు. నోటీసులను తీసుకోవడానికి నిరాకరించారు. తాను భర్తతో కలిసి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం రెండు వారాలుగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో వాణితో కలిసి ఉండే ప్రసక్తే లేదని దువ్వాడ స్పష్టం చేశారు. వాణికి నేను కేటాయించిన ఇంటికి వెళ్లిపోయి.. అవసరమైతే లీగల్గా పోరాడాలని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.
వాణి రోజుకోరకంగా మాట్లాడుతున్నారని మొదట తనపైకి పిల్లలను పంపించిందని, ఆ తర్వాత టెక్కలి (Tekkali)వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేసిందని.. ఆస్తులపై మాట్లాడిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా కలిసి ఉందామని చెబుతుందని మండిపడ్డారు. తన న్యాయవాది చెప్పడంతోనే వాణి మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిలో నుంచి నన్ను తరిమి వేసిన తర్వాత చచ్చినా.. బతికినా పట్టించుకోలేదన్నారు. రాజకీయంగా తనను పతనం చేయాలన్నదే వాణి ఉద్దేశమని తెలిపారు. వాణితో కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అయితే పిల్లల పట్ల తండ్రిగా తన బాధ్యత నిర్వహిస్తానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టంచేశారు. ఒకవైపు పెద్ద మనుషులను చర్చలకు పంపిస్తూనే, మరోవైపు వాణి కోర్టుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతుళ్ల పేరు మీద సుమారు 29 కోట్ల ఆస్తులు రాయడానికి సిద్ధంగా ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) స్పష్టం చేశారు. ఓ బంగళా ఇచ్చానని, దాన్ని వాడుకోవాలని సూచించారు. అవసరమైతే ఆ ఇంటికి వెళ్లిపోయి లీగల్గా పోరాటం చేయాలని తెలిపారు. దయచేసి నన్ను వేధించవద్దని కోరారు. వాణి ఖర్చుల కోసం16 నెలల్లో రూ.40 లక్షలు ఇచ్చానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు
అనారోగ్యంతో ఉన్నాను..10రోజుల తర్వాతా కలుస్తాను : దివ్వెల మాధురి
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో కీలకంగా మారిన దివ్వెల మాదిరి (Divvala Madhuri) తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని దివ్వల మాధురి తెలిపారు. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్తో బ్లడ్ క్లాట్ మళ్లీ ఇబ్బందిపెడుతోందని వెల్లడించారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని.. 10 రోజుల తర్వాత మళ్లీ అందరి ముందుకొస్తానని చెప్పారు. మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉందని, ఇదే సపోర్టుతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నానని, కానీ మళ్లీ హెల్త్ ప్రాబ్లెం వచ్చిందని, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, మాట్లాడలేకపోతున్నానని, అందుకే కొద్దిరోజులు సోషల్మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. మళ్లీ 10 రోజుల తర్వాత మీడయాలో లైవ్కు వస్తాను. మీ అందరితో మాట్లాడతానని, నన్ను సపోర్టు చేసినందుకు చాలా థ్యాంక్స్.’ అని దివ్వల మాధురి సోషల్మీడియాలో పోస్టు చేశారు.