బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారిపట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. కేసీఆర్ను దెబ్బ తీయాలనుకే వారికి ప్రజలే బుద్ది చెబుతారని, నిఖార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసి, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారిపట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. కేసీఆర్ను దెబ్బ తీయాలనుకే వారికి ప్రజలే బుద్ది చెబుతారని, నిఖార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసి, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్ అని పేర్కొన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్ది అని తెలిపారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్
ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్
ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు…
— KTR (@KTRBRS) March 29, 2024