Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నిన్నమొన్నటి వరకు స్వల్పంగా దిగివచ్చిన ధరలు బులియన్ మార్కెట్లో బుధవారం మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.200 తగ్గి పెరిగి రూ.61,350 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 తగ్గి తులానికి రూ.66,930కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.62,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,800కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,930కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.61,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,080కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,930 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి స్వల్పంగా దిగివచ్చింది. రూ.300 తగ్గి కిలో వెండి రూ.77,300 ధర పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.80,200కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.