Gold Rates | షాకిచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Gold Rates | షాకిచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Gold Rates | మగువలకు పసిడి మరోసారి షాక్‌ ఇచ్చింది. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం ధర మరోసారి పెరిగింది. ఇటీవల గతంలో ఎన్నడూలేని విధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్నా మొన్న స్వల్పంగా దిగిరావడంతో ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ ధర పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 పెరిగి తులానికి రూ.60,810కి చేరింది. 24 క్యారెట్ల పసిడి తులం రూ.65,800కి చేరింది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,360 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,940కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,810 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,340కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,960 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,490కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.60,810 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.66,400 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. రూ.100 పెరిగి కిలో ధర రూ.77,400కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,400కు ఎగిసింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.