కీర్తి సురేష్ హవా చూశారా.. ఇప్పుడు అన్ని భాషలని దున్నేస్తుందిగా..!

మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రంతో ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, మలయాళ భాషలలోను ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తమిళంలో ఈ ముద్దుగుమ్మ నాలుగు సినిమాల్లో నటిస్తూ ఉండగా, ఆమె నటించిన ‘సైరెన్’ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కోలీవుడ్ స్టార్ జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కీరోల్ పోషించగా, ఇందులో అనుపమా పరమేశ్వరన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది.
ఇక కీర్తి నటిస్తున్న మరో ప్రాజెక్ట్ ‘రఘు తాత’ కాగా, ఈ మూవీని ‘కేజీఎఫ్’ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విమెన్ రైట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సుమన్ కుమర్ దరక్శత్వం వహించారు. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం కీర్తి సురేష్కి కొత్త కాదు ఇప్పుడు `రివాల్వర్ రీటా` అనే చిత్రంతో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. వింటేజ్ కథతో రాబోతున్న ఈ చిత్రానికి కె చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ది రూట్, ప్యాషన్ స్టూడియో పతాకాలపై జగదీష్ నిర్మిస్తుండగా, ఈ మూవీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మరోవైపు ఈ భామ గణేష్ రాజ్ దర్శకత్వంలో కన్నివేడి మూవీ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
సౌత్లో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్పై కూడా ఫోకస్ పెట్టింది. ఆ భాషలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తుండగా, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. హిట్ చిత్రాల దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఈ మూవీ రూపొందుతుంది. ఇక యష్ రాజ్ థ్రిల్లర్ లో ‘అక్క’ వెబ్ సిరీస్ రూపొందుతుండగా, ఇందులో రాధికా ఆప్టేతో కలిసి సందడి చేయనుంది. ఈ వెబ్ సిరీస్పై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో కలిసి ఎలాంటి రచ్చ చేయనుందని అందరు ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి కీర్తిసురేష్ సౌత్తో పాటు బాలీవుడ్ని దున్నేసే ప్లాన్లో ఉంది.