విధాత: రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పకపోవడం అంటే ఇదే.. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారి.. తరువాత సొంత పార్టీ పెట్టి.. మళ్ళీ బీజేపీకి చేరువైన ఓ మాజీ ఎంపీని బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీతను బుధవారం సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం […]
విధాత: రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పకపోవడం అంటే ఇదే.. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారి.. తరువాత సొంత పార్టీ పెట్టి.. మళ్ళీ బీజేపీకి చేరువైన ఓ మాజీ ఎంపీని బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీతను బుధవారం సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు రూ.42 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించలేనందున బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు. గీతను అరెస్ట్ చేసి బెంగుళూరుకు తరలించారని తెలుస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగవేసిన విషయమై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేసింది. చార్జీషీట్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు హైద్రాబాద్కు చెందిన నేషనల్ బ్యాంక్ మిడ్ కార్పోరేషన్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అప్పటి బ్రాంచ్ మేనేజన్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవింద్ తదితరులపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది.
బ్యాంకు నుంచి రుణం పొందేందుకు నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు కుట్రకు పాల్పడ్డారని చార్జీషీట్లో సీబీఐ పేర్కొంది. వాస్తవాలను అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచారని సీబీఐ ఆరోపించారు. బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా చార్జీషీట్లో సీబీఐ పేర్కొంది.
ఇక ఆర్డీవోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పని చేసిన గీత 2014లో ఆనూహ్యంగా ఎంపీ టికెట్ దక్కించుకుని అరకు నుంచి వైస్సార్సీపీ తరఫున గెలిచారు. గెలిచిన కొద్ధి నెలల్లోనే అప్పటి కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకతో కలిసి అనధికారికంగా టీడీపీలో చేరిపోయారు. అక్కడ పెద్దగా ప్రయార్టీ లేక పోయినా అధికార పార్టీలో ఉన్నాం అన్న ఆనందంలో కొన్నాళ్ళు గడిపారు.
ఆ తరువాత ఆమెకు 2019లో అరకు నుంచి ఎంపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆమె జన జాగృతి పేరిట రాజకీయ పార్టీ ప్రారంభించి కొన్ని సీట్లకు అభ్యర్థులను బరిలో నిలిపారు కానీ ఎక్కడా డిపాజిట్లు రాలేదు.. దీంతో ఆమె బీజేపీలో చేరిపోయారు. అధికార పార్టీల్లో చేరిన ఆమెను పాత కేసులు వెంటాడుతూనే ఉన్నాయి..చివరకు ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేయడంతో మళ్ళీ ఆమె వెలుగులోకి వచ్చారు.
రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, భర్త పి.రామకోటేశ్వరరావులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. అదేవిధంగా బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్లకూ ఐదేళ్ల శిక్ష విధించింది. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించింది.