పులులు ఇతర జంతువుల కోసం వేటాడుతూనే ఉంటాయి. తమ కంటికి కనిపించిన ఏ జంతువును కూడా అవి వదిలిపెట్టవు. ఆ జంతువుల రక్తాన్ని కళ్లారా చూడాల్సిందే. ఆకలి తీర్చుకోవాల్సిందే.
జైపూర్ : పులులు ఇతర జంతువుల కోసం వేటాడుతూనే ఉంటాయి. తమ కంటికి కనిపించిన ఏ జంతువును కూడా అవి వదిలిపెట్టవు. ఆ జంతువుల రక్తాన్ని కళ్లారా చూడాల్సిందే. ఆకలి తీర్చుకోవాల్సిందే. ఓ ఆడ పులి జింకను వేటాడి చంపిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని రత్నంబోర్ నేషనల్ పార్కులో ఓ ఆడ పులి ఆహారం కోసం వేట కొనసాగిస్తోంది. అంతలోనే ఓ జింక తన కంటికి కనిపించింది. ఇంకేముంది దాన్ని వెంబడించి, వేటాడింది. పులి నుంచి తప్పించుకునేందుకు జింక శతవిధాలా ప్రయత్నించింది. కానీ జింక మెడ పట్టుకున్న పులి.. ఓ నీటి కొలను వద్ద చంపేసింది. ఆ తర్వాత జింక మాంసాన్ని ఆడ పులి పీక్కతిన్నది. ఈ దృశ్యాన్ని నేషనల్ పార్కు వర్గాలు తమ ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు.