Gold-Silver Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు రిలీఫ్ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు బుధవారం మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.66,350 వద్ద స్థిరంగా ఉన్నది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,380 వద్ద కొనసాగుతున్నది.
Gold-Silver Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు రిలీఫ్ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు బుధవారం మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.66,350 వద్ద స్థిరంగా ఉన్నది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,380 వద్ద కొనసాగుతున్నది. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.500 వరకు ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,040కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,380 వద్ద నిలకడగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,530 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,380 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు ధర స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.500 పెరిగి.. ఢిల్లీలో ధర వెండి రూ.91,500కి ఎగిసింది. హైదరాబాద్లో రూ.96వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.