ఉన్నమాట: నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఈళ్ళు చెబితే వినడమే కానీ నాకూ తెలీదు అంటాడు మహేష్ బాబు..ఇప్పుడు ఆ డైలాగ్ కేసీఆర్కు సరిగ్గా నప్పుతుంది. కేసీఆర్ స్కెచ్ వేసి దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలంగాణ బీజేపీ నేతలకు ఇప్పుడే అర్థం అవుతోంది. కేసీఆర్ జూలు విదిల్చి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇదిగో ఇలా ఉంటుందని బీజేపీ నేతలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టాలంటే ఒక అడుగు తగ్గి […]
ఉన్నమాట: నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఈళ్ళు చెబితే వినడమే కానీ నాకూ తెలీదు అంటాడు మహేష్ బాబు..ఇప్పుడు ఆ డైలాగ్ కేసీఆర్కు సరిగ్గా నప్పుతుంది. కేసీఆర్ స్కెచ్ వేసి దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలంగాణ బీజేపీ నేతలకు ఇప్పుడే అర్థం అవుతోంది. కేసీఆర్ జూలు విదిల్చి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇదిగో ఇలా ఉంటుందని బీజేపీ నేతలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.
పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టాలంటే ఒక అడుగు తగ్గి అందర్నీ కలుపుకుని పోవాలన్న రాజకీయ సూత్రాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ వెంట నడిచి పదవులు పొంది .. ఏవో చిన్న చిన్న సమస్యలతో పార్టీని వీడి వెళ్లిన వాళ్ళను కేసీఆర్ స్వయంగా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఉద్యమకారులందరినీ తిరిగి తనే స్వయంగా ఫోన్లు చేసి మరీ రప్పించి వారి రాజకీయ భవిష్యత్ పై హామీలిస్తున్నారు. దీంతో వారంతా మళ్ళీ ఘర్ వాపసి అంటూ వెనక్కి వస్తున్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండే దాసోజు శ్రవణ్ ఆమధ్య బీజేపీలో చేరారు. అయితే ఆయన మళ్ళీ టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ ఆయన బిజేపీ మీద బురదజల్లి పోతున్నారు. మునగోడులో బీజేపీ డబ్బులు వెదజల్లుతోందని చెబుతూ పార్టీలో బండి సంజయ్ నాయకత్వం మీద కూడా అసంతృప్తిని వెళ్లగక్కారు.
శ్రవణ్ తరువాత మరో సీనియర్ నేత స్వామిగౌడ్ సైతం బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ పంపారు. ఆయనా కారెక్కి మళ్ళీ యాక్టివ్ పొలిటికల్ రోల్ లీడ్ చేసేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని అంటున్నారు. గతంలో స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్గా పని చేశారు.
ఒకే రోజు ఇద్దరు టీఆర్ఎస్లో చేరడం వెనుక కేసీఆర్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. నిన్న ఉదయం నుంచి టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ జితేందర్ రెడ్డి లాంటి వారికి కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి కలిసి తిరిగి పనిచేద్దాం అని పిలుపునిచ్చినట్టు తెలిసింది.
మునుగోడులో ఎలాగైనా గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీకి ఈ ఇద్దరు నాయకుల నిష్క్రమణ పెద్ద దెబ్బ అంటున్నారు. చూస్తుంటే ఇంకెందరు నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారో.. ఎన్నికల్లోపు ఇంకెందరు వెళ్లిపోతారో అన్నా గుబులు బీజేపీలో నెలకొంది.