ముంబై 26/11 దాడి కుట్రదారు, లష్కరే తాయిబా వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి పాకిస్థాన్లో గుండెపోటుతో మరణించినట్టు ఐక్యరాజ్యసమితి
విధాత: ముంబై 26/11 దాడి కుట్రదారు, లష్కరే తాయిబా వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి పాకిస్థాన్లో గుండెపోటుతో మరణించినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భుట్టావి గత ఏడాది మేలో పంజాబ్ ప్రావిన్స్లో ప్రభుత్వ కస్టడీలో ఉండగా గుండెపోటుతో మరణించినట్టు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ధ్రువీకరించింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకారం.. “2023 మే 23న పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లోని మురిడ్కేలో భుట్టావి గుండెపోటుతో మరణించాడు” అని తెలిపింది. ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ ముహమ్మద్ సయీద్కు భుట్టావి డిప్యూటీ. సయీద్ను నిర్బంధించినప్పుడు కనీసం రెండు సందర్భాలలో భుట్టావి లష్కరే తాయిబా/జమాత్-ఉద్-దవా (LeT/JuD) తాత్కాలిక చీఫ్గా పనిచేశాడు. నవంబర్ తర్వాత కొన్ని రోజుల తర్వాత సయీద్ నిర్బంధించబడ్డాడు.
2008 ముంబై దాడులు జరిగాయి. ఆ కాలంలో భుట్టవి బృందం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేది. “సయీద్ను కూడా మే 2002లో నిర్బంధించారు. అతను లష్కరే తాయిబా/జమాత్-ఉద్-దవా ఉగ్రవాద సంస్థల్లో కీలక వ్యక్తి. ఇతడి సూచనలు, వ్యూహాల ప్రకారమే ఉగ్రదాడులను సభ్యులు నిర్వర్తించేవారు. రెండు సంస్థ కార్యకలాపాలకు భుట్టావి ఫత్వాలు జారీచేసేవాడు. 2008 నవంబర్లో భారతదేశంలోని ముంబైలో జరిగిన తీవ్రవాద దాడి సూత్రధారి కూడా ఇతడే. ముంబై దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఉపన్యాసాలు ఇచ్చారు. వారిని ముంబై వచ్చి ఉగ్రదాడులు చేసేలా పురిగొల్పాడు. అనుసరించాల్సిన వ్యూహాలను సైతం చెప్పాడు ” అని భద్రతా మండలి తెలిపింది.
2002 మధ్యలో భుట్టావి లాహోర్లో ఎల్ఈటీ సంస్థాగత స్థావరాన్ని స్థాపించడానికి బాధ్యత వహించాడు. భద్రతా మండలి 2012లో భుట్టావిని ఉగ్రవాదిగా గుర్తించింది. కొన్నాళ్ల తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి, ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రహ్మాన్ మక్కీతోపాటు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై ఆగస్టు 2020లో అతడికి పదహారున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.