ఒమిక్రాన్ ఎఫెక్ట్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అంక్షలు

విధాత‌: దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అప్రమత్త మైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని ఎయిర్ పోర్ట్ ఆధికారులు స్పష్టం చేశారు. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ గా తెలినవారిని హోం క్వారంటైన్ లో లేదా ఆస్పత్రిలో […]

ఒమిక్రాన్ ఎఫెక్ట్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అంక్షలు

విధాత‌: దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అప్రమత్త మైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని ఎయిర్ పోర్ట్ ఆధికారులు స్పష్టం చేశారు. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ గా తెలినవారిని హోం క్వారంటైన్ లో లేదా ఆస్పత్రిలో చేరాలని ఆధికారులు ఫోన్ చేసి చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, సమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం, తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరీక్షలో నెగిటివ్ అని తేలితేనే ఎయిర్ పోర్ట్ లో నుంచి వెలుపలి కి అనుమతినిస్తున్నారు. లేదంటే క్వారెంటైన్ కు తరలిస్తారు. ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ఎయిర్ పోర్ట్ లో మరో రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.