తెలంగాణలో రెండో అతి పెద్ద పెద్దగట్టు (లింగమంతుల) జాతరను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి

వైభవంగా మకర తోరణం తరలింపు వేడుక ప్రజా ఐక్యత సాధనాలు.. జాతరలు! భేరీలు వాయించి పెద్ద గట్టు జాతరను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి విధాత: సమాజాన్ని క్రమపద్ధ‌తిలో నడిపేందుకు, విభిన్న ఆచారాలు, సంస్కృతీ, సంప్రదాయాల కొన‌సాగింపున‌కు, ప్రజల ఐక్యతకు సాధనాలుగా జాతరలు తోడ్ప‌డుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. జాతరలో తొలి […]

తెలంగాణలో రెండో అతి పెద్ద పెద్దగట్టు (లింగమంతుల) జాతరను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి
  • వైభవంగా మకర తోరణం తరలింపు వేడుక
  • ప్రజా ఐక్యత సాధనాలు.. జాతరలు!
  • భేరీలు వాయించి పెద్ద గట్టు జాతరను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: సమాజాన్ని క్రమపద్ధ‌తిలో నడిపేందుకు, విభిన్న ఆచారాలు, సంస్కృతీ, సంప్రదాయాల కొన‌సాగింపున‌కు, ప్రజల ఐక్యతకు సాధనాలుగా జాతరలు తోడ్ప‌డుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. జాతరలో తొలి ఘట్టం మకర తోరణం తరలింపు ప్రక్రియను సూర్యాపేట లోని గొల్ల బజార్ ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి భేరీలు వాయించిన మంత్రి ఓ లింగా.. ఓ లింగా అంటూ సందడి చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆరెస్ హయాంలో అన్ని కులాలు, మతాలకు సమ న్యాయం కల్పించామని అన్నారు. రేపు రాత్రి కేసారం నుండి దేవర పెట్టే తరలింపు అనంతరం సోమవారం నుండి భక్తులు వ‌చ్చి లింగేశ్వ‌రుడిని ద‌ర్శించుకుంటార‌ని అన్నారు.

మూడు రోజులు పాటు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు