ఉన్నమాట: తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ ఇప్పుడు కోర్టు బోనులో నిలబడింది. నాగార్జున హోస్ట్గా నడుస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకుని ఇంకో సీజన్ని ఇప్పుడు కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం మీద ఇప్పటికే పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బూతు, సెక్స్ వంటి అనైతిక అంశాలు తప్ప ఇందులో ఏమీ లేదని సీపీఐ నేత కే.నారాయణ బహిరంగంగానే ఆరోపించారు. దీంతో కొందరు వ్యక్తులు […]
ఉన్నమాట: తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ ఇప్పుడు కోర్టు బోనులో నిలబడింది. నాగార్జున హోస్ట్గా నడుస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకుని ఇంకో సీజన్ని ఇప్పుడు కొనసాగిస్తోంది.
అయితే ఈ ప్రోగ్రాం మీద ఇప్పటికే పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బూతు, సెక్స్ వంటి అనైతిక అంశాలు తప్ప ఇందులో ఏమీ లేదని సీపీఐ నేత కే.నారాయణ బహిరంగంగానే ఆరోపించారు.
దీంతో కొందరు వ్యక్తులు వేసిన పిటిషన్ను విచారణకు తీసుకున్న ఏపీ హైకోర్టు అసలు ఆ ప్రోగ్రాంలో ఏముందో స్వయంగా చూసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని హైకోర్టు వెల్లడించడం విశేషం.
ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తుస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.