BRS కు బిగ్ షాక్..! ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి వైఖరికి నిరసనగా భారీగా రాజీనామాలు
BRS | MUTHOL కాంగ్రెస్ వైపు అడుగులు విధాత, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి వైఖరికి నిరసనగా ముధోల్ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సగౌడ్, మాజీ ఎంపీపీ అనూష సాయి బాబా సహా పలువురు బీఆరెస్కు రాజీనామా చేశారు. ఆదివారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్ట్ ద్వారా బీఆరెస్ అధిష్టానానికి పంపుతున్నామని వెల్లడించారు. గత మూడు పర్యాయాలుగా పోటీ […]

BRS | MUTHOL
కాంగ్రెస్ వైపు అడుగులు
విధాత, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి వైఖరికి నిరసనగా ముధోల్ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సగౌడ్, మాజీ ఎంపీపీ అనూష సాయి బాబా సహా పలువురు బీఆరెస్కు రాజీనామా చేశారు. ఆదివారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్ట్ ద్వారా బీఆరెస్ అధిష్టానానికి పంపుతున్నామని వెల్లడించారు.
గత మూడు పర్యాయాలుగా పోటీ చేసిన ఎమ్మెల్యే విఠల్రెడ్డికి పూర్తిగా సహకరించామని తెలిపారు. అయినా సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోక పోవడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. యువకుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. దళితులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం పథకాలు ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
టీపీసీసీ అధ్యక్షుCI రేవంత్ రెడ్డి తమను ఆహ్వానించి చర్చించారన్నారు. ఆగస్టు 5 లోపు నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలనే విషయంపై ప్రకటన చేస్తామన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇతర పార్టీల్లో చేరుతామని స్పష్టం చేశారు.
రాజీనామా చేసిన వారిలో సర్పంచ్ శ్వేత రవి కిరణ్ గౌడ్, నాయకులు నర్సారెడ్డి లక్ష్మణ్ సత్యనారాయణ, గైని భోజన్న, దశరథ్, తదితరులు ఉన్నారు. కాగా ఎమ్మెల్యేపై అసమ్మతితో వారంతా రాజీనామా చేయడం ముత్తోల్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.