యాదాద్రిని అపవిత్రం చేయొద్దు: గొంగిడి మహేందర్ రెడ్డి

విధాత: స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ నాయకులు యాదాద్రి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తాననడం సిగ్గుచేటని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు భంగం కలిగించొద్దని అన్నారు. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీ యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని ఆయన అన్నారు. యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఆధ్వర్యంలో […]

యాదాద్రిని అపవిత్రం చేయొద్దు: గొంగిడి మహేందర్ రెడ్డి

విధాత: స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ నాయకులు యాదాద్రి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తాననడం సిగ్గుచేటని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.

యాదాద్రి ఆలయ పవిత్రతకు భంగం కలిగించొద్దని అన్నారు. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీ యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని ఆయన అన్నారు.

యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఆధ్వర్యంలో బండి సంజయ్, రఘునందన్ రావు దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి గో బ్యాక్ బండి అంటూ నినాదాలు చేశారు.

దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ అధికారులకు రావాలని బీజేపీ చూస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది వాస్తవం కాదని యాదాద్రి పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.