విధాత, నల్గొండ: సీఎం కేసీఆర్ పట్టుదల.. దార్శనికతతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మునుగోడు ప్రాంతం ప్రజల ఫ్లోరైడ్ కష్టాలు తీరాయని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక,మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మునుగోడు నియోజకవర్గం కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు పశువులకు వ్యాక్సినేషన్ ప్రారంభించి పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి […]
విధాత, నల్గొండ: సీఎం కేసీఆర్ పట్టుదల.. దార్శనికతతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మునుగోడు ప్రాంతం ప్రజల ఫ్లోరైడ్ కష్టాలు తీరాయని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక,మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మునుగోడు నియోజకవర్గం కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు పశువులకు వ్యాక్సినేషన్ ప్రారంభించి పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి పాలకులు జిల్లా ఫ్లోరైడ్ కష్టాలను కన్నెత్తి కూడా చూడలేదన్నారు. మునుగోడు నో మ్యాన్ జోన్ గా మరే ప్రమాదం ఉంది అని డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరించినా కూడా ఆనాటి ప్రభుత్వం లు పట్టించుకోలేదన్నారు.
ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టారన్నారు. దార్శనికుడు కేసీఆర్ వల్లనే మునుగోడులో ఇవ్వాళ పచ్చటి పొలాలు, దర్శనం ఇస్తున్నాయని, డిండి ఎత్తిపోతల పథకం కూడా చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించు కున్నాయని.. తెలంగాణలో సబ్భాండ వర్గాలు ఇవ్వాల సంతోషంగా ఉన్నాయని.. మత్స్య కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు.
దేశంలోనే తెలంగాణ మత్స్యకారులు అత్యధికంగా చేపలను ఉత్పత్తి చేస్తున్నారని, ఇది తెలంగాణకే గర్వ కారణమన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో వినూత్న పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలు ఎన్నికలైన, మరో సందర్భం ఏదైనా యావత్ తెలంగాణ కేసీఆర్ వెంట నడవాలన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచే తెలంగాణా ఎట్లా ఉండాలో, ఎలా బాగు చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారన్నారు. కుల వృత్తులకు జీవం పోసి,, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. ఇంటింటికి సురక్షిత నది జలాలను అందించి, ఫ్లోరైడ్ ను రూపు మాపారన్నారు.
మునుగోడుకు వచ్చి ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులకు మెదడు మోకాళ్లలో ఉన్నదని, అమిత్ షా వచ్చి రాజకీయంగా వాగి పోతున్నాడని రాష్ర్టానికి కేంద్రం నుంచి ఆడిగినవి మాత్రం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ తెలంగాణకు ఎం చేసిందో చెప్పాలను, కేంద్ర బీజేపీ మంత్రులు, నాయకులు తెలంగాణకు వచ్చి టైమ్ పాస్ చేసి పోతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైన రీతిలో కట్టారన్నారు.
రాజీనామా చేస్తే అభివృద్ధి ఎట్లా అయితదో బీజేపీ చెప్పాలని.. మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే దక్కుతుందన్నారు. గొర్రెల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియని, అర్హులకు అందరికి యూనిట్లు ఇస్తామన్నారు. ఇప్పటికే సగం మందికి ఇచ్చామని, బీజేపీ వాళ్లకు ప్రభుత్వ పధకాల పట్ల కనీస అవగాహన లేదని, వర్లడం ఒక్కటే వాళ్లకు తెలుసన్నారు.
ఈ రోజు దేశంలో రూ.2,016 ఆసరా పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్ర తెలంగాణ ఒక్కటేనన్నారు. దేశంలో తెలంగాణలోనే వృద్ధులు, వికలాంగులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, కల్యాణ లక్ష్మీ పథకం పేదలకు,ఆడ పిల్లల తల్లిదండ్రులకు వరంలాగా మారిందన్నారు.
ప్రజలు ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు చేసే ప్రచారంతో ఆగం కావొద్దని, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని, మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి జెట్ స్పీడ్ తో ముందుకు పోతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, షిప్ అండ్ గోట్ చైర్మన్ బాలరాజు యాదవ్, డిఎల్డిఏ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.