ఊరటనిచ్చిన బంగారం ధరలు..! హైదరాబాద్లో నేటి ధరలు ఇవే..!
బంగారం ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ను ఇచ్చాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఆదివారం మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి.

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ను ఇచ్చాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఆదివారం మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.57,700 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడి రూ.62,950 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,710 వద్ద స్థిరంగా ఉన్నది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,950 వద్ద కొనసాగుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం నిలకడగా కొనసాగుతున్నది.
ప్రస్తుతం హైదరాబాద్ వెండి కిలోకు రూ.77,500 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.