Gold Rate | బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. దేశంలో పుత్తడి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగి.. రూ.54,350కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగి.. రూ.59,280 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,430 పెరిగింది. 24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.59,430 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ […]
Gold Rate | బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. దేశంలో పుత్తడి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగి.. రూ.54,350కి చేరింది.
అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగి.. రూ.59,280 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,430 పెరిగింది.
24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.59,430 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,280 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,670 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,280కి చేరింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధ రూ.59,280 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కేజీ వెండి ధర రూ.70,900 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి రేటు రూ.75,200 పలుకుతున్నది.