గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలి సీఎస్, డీజీపీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, విధాత : నిజమైన స్ఫూర్తితో బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని జరుపుకోవాలి రాష్ట్ర ప్రజలకు హైకోర్టు సూచించింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు సుమోటో పిల్గా స్వీకరించింది. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. మత […]
హైదరాబాద్, విధాత : నిజమైన స్ఫూర్తితో బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని జరుపుకోవాలి రాష్ట్ర ప్రజలకు హైకోర్టు సూచించింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు సుమోటో పిల్గా స్వీకరించింది. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు.
దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని, వీటిపై చర్యలు తీసుకోవాలని బక్రీద్కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదన్న ధర్మాసనం.. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది.
గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్న ఏజీ ప్రసాద్.. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.