ఆర్థిక బిల్లుపై ఓటింగ్ విషయంలో పార్టీ విప్ను ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్సింగ్ పఠానియా అనర్హులుగా ప్రకటించారు
సిమ్లా: ఆర్థిక బిల్లుపై ఓటింగ్ విషయంలో పార్టీ విప్ను ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్సింగ్ పఠానియా అనర్హులుగా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు అల్పాహార విందుకు ఆహ్వానించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, రవి ఠాకూర్, ఇందర్ దత్ లఖన్పాల్, చైతన్యశర్మ, దేవీందర్ కుమార్లపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఫిర్యాదు నేపథ్యంలో స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటేయడంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఇదిలా ఉంటే.. పలు నాటకీయ పరిణామాల్లో మంత్రిపదవికి చేసిన రాజీనామాను విక్రమాదిత్యసింగ్ బుధవారం సాయంత్రం ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ అధిష్ఠానం పంపిన దూతలు భూపేశ్ భగేల్, భూపిందర్సింగ్ హుడా, డీకే శివకుమార్తో చర్చల అనంతరం ఆయన తన మానసు మార్చుకున్నారు.