రాష్ట్రంలో అర్హులంద‌రికీ ఇండ్ల స్థ‌లాలు.. కోటి కుటుంబాల‌కు ల‌బ్ధి: మంత్రి కేటీఆర్

విధాత: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని వల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండ్ల‌ స్థలాలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమ‌వారం బీఆర్‌కే భ‌వ‌న్‌లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్ల‌ స్థలాల‌ కేటాయింపు, జీఓ 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్/వక్ఫ్ భూములు తదితరాల […]

  • By: krs    latest    Feb 27, 2023 1:50 PM IST
రాష్ట్రంలో అర్హులంద‌రికీ ఇండ్ల స్థ‌లాలు.. కోటి కుటుంబాల‌కు ల‌బ్ధి: మంత్రి కేటీఆర్

విధాత: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని వల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండ్ల‌ స్థలాలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమ‌వారం బీఆర్‌కే భ‌వ‌న్‌లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్ల‌ స్థలాల‌ కేటాయింపు, జీఓ 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్/వక్ఫ్ భూములు తదితరాల అమలుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి సి.హెచ్ మల్లారెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌తో పాటు ఇతర శాఖ‌ల‌ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. దీనివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2014 సంవత్సరంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు.

జీవో 58 కింద‌ 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని సబ్‌ కమిటీ అధికారులను ఆదేశించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

నోటరీ చేయబడిన పత్రాల గురించి ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. పేదలకు అనుకూలమైన విధానాన్ని తీసుకోవాలని, అర్హత ఉన్న అన్ని కేసులను త్వరగా పూర్తి చేయాలని కమిటీ అధికారులను అభ్యర్థించింది.