వివాహేతర సంబంధం.. భర్తను 22 ముక్కలుగా నరికేసింది
Delhi | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం భార్యకు తెలిసింది. దీంతో తన కుమారుడి సాయంతో భర్తను 22 ముక్కలుగా నరికేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పాండవ్ నగర్లో ఈ ఏడాది జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఈ శరీర భాగాలను […]

Delhi | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం భార్యకు తెలిసింది. దీంతో తన కుమారుడి సాయంతో భర్తను 22 ముక్కలుగా నరికేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పాండవ్ నగర్లో ఈ ఏడాది జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఈ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయినప్పటికీ కేసులో పురోగతి కనిపించలేదు. అయితే శ్రద్ధా వాకర్ హత్య అనంతరం ఈ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ హత్య కేసు బయటపడింది.
A woman Poonam along with her son Deepak arrested by Crime Branch in #Delhi‘s Pandav Nagar for murdering her husband Anjan Das. They chopped off body in several pieces at Trilokpuri residence, kept in refrigerator and used to dispose of pieces in nearby ground. pic.twitter.com/3lzijYQb69
— Siraj Noorani (@sirajnoorani) November 28, 2022
ఢిల్లీలోని పాండవ్ నగర్కు చెందిన అంజన్ దాస్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్య పూనమ్కు తెలిసింది. ఎలాగైనా తన భర్తను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. కుమారుడు దీపక్ సాయంతో భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చింది. అతను స్పృహా కోల్పోయిన తర్వాత పదునైన ఆయుధంతో దాస్ శరీరాన్ని 22 ముక్కలుగా నరికారు.
అనంతరం ఆ భాగాలను ఓ బ్యాగులో చుట్టి.. సమీప ప్రాంతంలో పడేశారు. అయితే దీపక్ అనేకసార్లు ఆ ఏరియాకు వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో దీపక్ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీపక్, పూనమ్ను పోలీసులు రిమాండ్కు తరలించారు.