సర్వీస్లో ఉన్నంత వరకు నిజాయితీగా పని చేస్తా విధాత: వసూల్ రాజాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రెవెన్యూ కార్యాలయంలో గిర్దావర్(ఆర్.ఐ) చిలకరాజు నరసయ్య వినూత్నంగా నాకు లంచం వద్దు తాను సర్వీసులో ఉన్నంతవరకు నిజాయితీగానే పని చేస్తానని గర్వంగా చెబుతున్నాడు. తాను 1995లో నల్లగొండ జిల్లా డిండి తాసిల్దార్ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగంలో చేరానని. ఆపై నల్లగొండ ఆర్డివో ఆఫీసులో, మోతే మండలంలో జూనియర్ అసిస్టెంట్గా, సూర్యాపేట కలెక్టరేట్లో, హుజూర్నగర్ ఆర్డీవో ఆఫీసుల్లో పనిచేసి డిపార్ట్మెంటల్ పరీక్షలు […]
విధాత: వసూల్ రాజాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రెవెన్యూ కార్యాలయంలో గిర్దావర్(ఆర్.ఐ) చిలకరాజు నరసయ్య వినూత్నంగా నాకు లంచం వద్దు తాను సర్వీసులో ఉన్నంతవరకు నిజాయితీగానే పని చేస్తానని గర్వంగా చెబుతున్నాడు.
తాను 1995లో నల్లగొండ జిల్లా డిండి తాసిల్దార్ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగంలో చేరానని. ఆపై నల్లగొండ ఆర్డివో ఆఫీసులో, మోతే మండలంలో జూనియర్ అసిస్టెంట్గా, సూర్యాపేట కలెక్టరేట్లో, హుజూర్నగర్ ఆర్డీవో ఆఫీసుల్లో పనిచేసి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి 2021 ఫిబ్రవరి 1న పాలకవీడు తాసిల్దార్ కార్యాలయంలో గిరిదావర్గా(ఆర్.ఐ) చేరానని అన్నారు.
అయితే తనపై కార్యాలయ సిబ్బంది నువ్వు బ్యాడ్జీలు ధరించి రావొద్దని ఒత్తిడి చేస్తున్నారని, ఉన్నతాధికా రుల నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయని అయినా నేను ఎట్టి పరిస్థితుల్లోను బ్యాడ్జి తీసేయనని ప్రతిరోజు విధులకు వచ్చేటప్పుడు నాకు లంచం వద్దు అని బ్యాడ్జి ధరించి వస్తానని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు తనకు కార్యాలయంలో టేబుల్ లేదని వీఆర్వోలకు కేటాయించిన సీట్లలోనే కూర్చుని విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. కార్యాలయంలో తనను అవమానిస్తున్నారని, నా విధుల్లో ఇతరుల జోక్యంతో చాలా ఇబ్బంది పడుతున్నానని అన్నారు.
దీనిపై ఆయనను వివరణ అడగగా, ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే నా చొక్కా జేబుకు ఐడీ కార్డు పెట్టుకున్నానని నరసయ్య తెలిపారు.
మీరు లంచం తీసుకోనని అంటున్నారు అంటే మిగతా ఉద్యోగులు తీసుకుంటున్నారని అర్థమా, రెవెన్యూ ఆఫీసులో లంచం లేనిదే ఫైలు కదలదని ప్రజలు గుసగుసలాడుతుంటుంటే, మీరేమో నేను లంచం తీసుకొను అనీ ఐడీ కార్డ్ పెట్టుకొని వచ్చారని అడగగా ఒకరితో నాకు సంబంధం లేదు నేను మాత్రం లంచం తీసుకోనని ఖరాకండిగా తేల్చి చెప్పారు.
దీంతో ఆయన కర్తవ్య దీక్షపై స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఇలాంటి వారు ఒకరున్నా చాలు ఇతరుల్లోను మార్పు వస్తుందని పేర్కొంటున్నారు.