పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి గుంటకండ్ల
విధాత, సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 9వరకు జరిగే జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.. 6కోట్ల 50 లక్షలు నిధులను జాతర ఏర్పాట్ల కోసం కేటాయించామని తెలిపిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులకు, స్నానాలు ఆచరించే కోనేరు, మంచి […]

విధాత, సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 9వరకు జరిగే జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.. 6కోట్ల 50 లక్షలు నిధులను జాతర ఏర్పాట్ల కోసం కేటాయించామని తెలిపిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులకు, స్నానాలు ఆచరించే కోనేరు, మంచి నీటి ట్యాంక్, పార్కింగ్ ప్రదేశాలను మంత్రి పరిశీలించారు.
తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పేరొందిన దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతరకు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించామని, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం వంటి వసతులు కల్పనపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను కోరారు.. కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన యాదవ వంశస్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
జాతర సౌకర్యాల పై మంత్రి భక్తులను ఆరా తీశారు.
పెద్ద గట్టు జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తున్న క్రమంలో యాదవ కుటుంబాలకు చెందిన భక్తులతో ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే జాతరకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయని వారు మంత్రికి చెప్పడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా జాతరను పట్టించుకోలేదని, నిధుల లేమితో అర కొర ఏర్పాట్ల మధ్యనే ఇబ్బందికరంగా జాతరకు వచ్చేవాళ్ల మన్నారు. ఇప్పుడు ఏర్పాట్లు చాలా మెరుగుపడ్డాయని తెలిపారు.
మంత్రితో పాటు పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, కలెక్టర్ హేమంత్ పాటిల్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్,, కౌన్సిలర్లు లక్ష్మీ మకత్ లాల్, బాషా మియా, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, జడ్పీటటీసీలు సంజీవ నాయక్, జీడి బిక్షం, అంజయ్య, చివ్వెంల వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, కాచం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.