Parameshwar Naik | కాంగ్రెస్ గెలుపు ఖాయం.. సంక్షేమానికే పెద్ద పీట: పరమేశ్వర్

పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలి మహబూబాబాద్ పార్లమెంట్ పరిశీలకులు పరమేశ్వర్ నాయక్ Parameshwar Naik | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంట్ పరిశీలకుడు పరమేశ్వర్ నాయక్ ధీమా వ్యక్తంచేశారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ, నియంతృత్వ పోకడలతో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. […]

  • By: Somu    latest    Aug 18, 2023 12:30 PM IST
Parameshwar Naik | కాంగ్రెస్ గెలుపు ఖాయం.. సంక్షేమానికే పెద్ద పీట: పరమేశ్వర్
  • పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలి
  • మహబూబాబాద్ పార్లమెంట్ పరిశీలకులు పరమేశ్వర్ నాయక్

Parameshwar Naik | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంట్ పరిశీలకుడు పరమేశ్వర్ నాయక్ ధీమా వ్యక్తంచేశారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ, నియంతృత్వ పోకడలతో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు.

తెలంగాణ వస్తె మన తుకులు మారుతాయి.. మన భాదాలు తీరుతాయని నమ్మిన ప్రజలను మోసం చేసిండని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, రుణమాఫీ, ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చినా, రాష్ట్రంలో ఎక్కడా అమలు చేయకుండా మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంక్షేమానికే కాంగ్రెస్ పెద్ద పీట: ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికే పెద్టపీట వేస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ, 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 4 వేలు నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న 2లక్షల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఎల్డీఎంఆర్సీ కో ఆర్డినేటర్ డాక్టర్ అనీల్, మర్కా విజయ్ కుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయిభ్ ఖాన్, ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,లీగల్ సెల్, సమాచార హక్కు జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,నియోజక వర్గ కో ఆర్డినేటర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న పాల్గొన్నారు.